devotional news

బోడుప్పల్‌లో మారుమోగిన “మారుతీ” నినాదాలు.. గాయత్రి మాత ఆలయంలో భక్తుల పూనకాలు!


మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్‌లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పల సుధాకర్, జనరల్ సెక్రటరీ నందకుమార్ జోషి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగాయి.





Read Also This:
రుద్రాక్షమాలను ఎలాంటి వారు ధరించకూడదు..? నియమాలు ఏంటి..?

వైశాఖ బహుళ దశమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని సుందరంగా అలంకరించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భక్తులు ఏకస్వరంతో హనుమాన్ చాలీసా పారాయణం చేయడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగాయి.

అనంతరం అర్చకులు స్వామివారికి మంగళహారతులు సమర్పించి భక్తులకు సింధూర తిలకం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువతతో పాటు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్

May 14, 2026

కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే ...

View Post

బోడుప్పల్‌లో మారుమోగిన “మారుతీ” నినాదాలు.. గాయత్రి మాత ఆలయంలో భక్తుల పూనకాలు!

May 13, 2026

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్‌లోని శ్ర...

View Post

కొల్చారం మండలంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

May 13, 2026

కొల్చారం మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా ని...

View Post

తిరుమలలో నటుడు రాజశేఖర్ కుటుంబ దర్శనం: ఫోటోలు వైరల్ అయ్యాయా?

May 13, 2026

టాలీవుడ్ నటుడు Rajasekhar తన కుటుంబ సభ్యులతో కలిసి పవి...

View Post

బద్రీనాథ్ మార్గంలో ఆధ్యాత్మికానుభూతి అలకనంద తీరాన రుద్రాక్ష వనాలు..!

May 12, 2026

మంచు గిరుల చెంత కొలువైన బద్రీనాథ్ ధామానికి వెళ్...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 107246