కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View Post
రుద్రాక్షను ఆధ్యాత్మిక కవచంగా మహాదేవుడి రూపంగా పరిగణిస్తారు. దీనిని ధరించడం వల్ల ఆ మహాదేవుడి ఆశీర్వచానాలు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాదు భగవంతుని కరుణ ద్వారా జీవితంలోకి ఆనందం సిద్ధిస్తుంది. దీనిని ధరించడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి. రుద్రాక్ష ధరించేటప్పుడు అందుకు సంబంధించిన నియమాలను పాటించకపోతే జీవితంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయని నమ్ముతారు. రుద్రాక్ష ధరించేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి..? అనేవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.. అవేంటంటే..?
రుద్రాక్ష ఎలాంటి వాళ్ళైనా ధరించవచ్చా..?శ్మశానవాటికకు వెళ్తున్నప్పుడు, అంత్యక్రియలకు వెళ్తున్నప్పుడు, ఇంటి నుంచి బయలుదేరే ముందు రుద్రాక్షను తీసివేసి ఆలయంలో ఉంచండి. ఎవరైనా బంధువులు చనిపోయిన సమయంలో, శోక సమయంలో రుద్రాక్ష ను అస్సలు ధరించకూడదు. అంతేకాదు ఇంట్లో పుట్టిన సమయంలో రుద్రాక్ష ధరించకూడదు. రుద్రాక్ష ధరించి నిద్రించకూడదు. కాబట్టి, నిద్రపోయే ముందు రుద్రాక్షను తీసి ఇంట్లో పూజ గదిలో ఉంచాలి.
రుద్రాక్ష ధరించిన వారు మాంసం, మద్యం, వంటి తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. రుద్రాక్ష ధరించిన వ్యక్తి పొరపాటున కూడా మాంసం, మద్యం వంటివి తీసుకోకూడదు.
రుద్రాక్ష ధరించే ముందు, దానిని పచ్చి పాలు, గంగా జలంతో శుద్ధి చేయాలి. ఆ తర్వాత, మాత్రమే రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రుద్రాక్షను ధరించే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి.
ఎర్రటి లేదా పసుపు పట్టు దారంతో కట్టిన రుద్రాక్షను ధరించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఒకరు ధరించిన లేదా తీసివేసిన రుద్రాక్షను మరొకరు ధరించకూడదు.
రుద్రాక్ష ధరించిన వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
అంతేకాదు ఆ మహేశ్వరుని ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయి.
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో కష్టాలు తొలగిపోతాయి.
ప్రతికూల శక్తులు దగ్గరకు చేరవు. అదృష్టం వరిస్తుంది.
రుద్రాక్ష ధరించాలనుకుంటే, సోమవారం మహాశివుడికి ప్రియమైన రోజు కాబట్టి సోమవారాన్నే శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా సోమవారం లేదా మహాశివరాత్రి నాడు రుద్రాక్ష ధరించడం శుభప్రదమైనదిగా భావిస్తారు.
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View PostMay 13, 2026
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమి...
View PostMay 13, 2026
కొల్చారం మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భ...
View PostMay 13, 2026
టాలీవుడ్ నటుడు Rajasekhar తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్రమైన Tirumalaను సందర్శించారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన రాజశేఖర్ ఫ్యామి...
View PostMay 12, 2026
మంచు గిరుల చెంత కొలువైన బద్రీనాథ్ ధామానికి వెళ్లే భక్తులకు ఇకపై ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికానుభూతి కలగనుంది. అలకనంద నది పరవళ్లకు తో...
View PostMay 12, 2026
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం Srisailam Temple వద్ద ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య ఘనం...
View Post