కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
Read Also This:
బోడుప్పల్లో మారుమోగిన “మారుతీ” నినాదాలు.. గాయత్రి మాత ఆలయంలో భక్తుల పూనకాలు!
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మల్లన్న స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని, రైతులు ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఆలయానికి వచ్చిన భక్తులతో ఆయన ఆత్మీయంగా మాట్లాడారు.
ఎమ్మెల్యే రాక సందర్భంగా ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ఎమ్మెల్యేతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.
