కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View Post
ఈ ఏడాది సీతా నవమి ఏప్రిల్ 25వ తేదీన రానుంది. వైశాఖ మాసం, శుక్ల పక్ష తొమ్మిదవ తిథి.. సకల శుభాలకు నిలయం. భూదేవి పుత్రిక, అయోధ్య రాముడి ఇల్లాలు సీతా మహాసాధ్వి అవతరించిన పవిత్ర పర్వదినం 'సీతా నవమి'. జానకీ మాతను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. ఈ పవిత్ర దినాన నియమ నిష్టలతో జానకమ్మను, శ్రీరామచంద్రుడిని ఆరాధిస్తే అఖండ సౌభాగ్యం, సంతాన ప్రాప్తి, ఆర్థికాభివృద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం.
ఉదయాన్నే భక్తితో..సీతా నవమి పర్వదినాన సూర్యోదయానికి ముందే మేల్కొనాలి. గంగాజలం కలిపిన నీటితో స్నానమాచరించి, పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే పసుపు రంగు సౌభాగ్యానికి, మంగళానికి సంకేతం.
పూజా విధానం-నియమాలు..ఒక వేదికపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి సీతారాముల విగ్రహాన్ని లేదా పటాన్ని ప్రతిష్టించాలి. తల్లికి పసుపు రంగు పుష్పాలు, సుగంధ ద్రవ్యాలను సమర్పించాలి. షోడశోపచారాలతో పూజించి, అగరబత్తీలు, నెయ్యి దీపంతో హారతి ఇవ్వాలి. జానకీ మాత నుదుటిపై ఏడుసార్లు కుంకుమను ఉంచి, ఆపై ఆ ప్రసాదాన్ని తమ నుదుట ధరించడం వల్ల వివాహిత స్త్రీలకు శాశ్వత సుమంగళీ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.
పూజా సమయంలో 'శ్రీ జానకీ రామభ్యాం నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. సీతా చాలీసా పఠనం విశేష ఫలితాలను ఇస్తుంది.
దాన ధర్మాలు- అన్నపూర్ణా కటాక్షం.సీతా నవమి నాడు చేసే దానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసుపు వస్త్రాలు, పసుపు రంగు పండ్లు, సుమంగళి వస్తువులను అంటే గాజులు, పసుపు, కుంకుమ దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలను అన్నదానం చేయడం వల్ల ఇంట్లో ఎన్నటికీ అన్నపానాలకు కొరత ఉండదు.
సాయంత్రం వేళ.. దీపారాధనసంధ్యా సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద, తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. దీనివల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి, సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. జగన్మాత సీతమ్మను స్మరిస్తూ, శ్రీరాముని సేవలో తరిస్తే జీవితం సుఖమయం అవుతుంది. 'జై సీతారాం!'.
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View PostMay 13, 2026
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమి...
View PostMay 13, 2026
కొల్చారం మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భ...
View PostMay 13, 2026
టాలీవుడ్ నటుడు Rajasekhar తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్రమైన Tirumalaను సందర్శించారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన రాజశేఖర్ ఫ్యామి...
View PostMay 12, 2026
మంచు గిరుల చెంత కొలువైన బద్రీనాథ్ ధామానికి వెళ్లే భక్తులకు ఇకపై ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికానుభూతి కలగనుంది. అలకనంద నది పరవళ్లకు తో...
View PostMay 12, 2026
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం Srisailam Temple వద్ద ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య ఘనం...
View Post