కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View Post
జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడంటేనే చాలా మందిలో ఒక రకమైన భయం, ఆందోళన నెలకొంటాయి. శని మహాదశ, ఏల్నాటి శని (సడే సతి), లేదా అర్ధాష్టమ శని అనగానే ఏదో కీడు జరుగుతుందని భయపడతారు. కానీ, శనిదేవుడు కేవలం శిక్షించేవాడు మాత్రమే కాదు, ఆయన 'కర్మ ఫల ప్రదాత'. అంటే మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇచ్చే న్యాయమూర్తి. మీ కర్మలు బాగుంటే, శని కాలం మీకు రాజయోగాన్ని కూడా ప్రసాదిస్తుంది.
శని దేవుడు ఎవరిపై కరుణ చూపుతాడు..?శని దేవుడి అనుగ్రహం పొందాలంటే కేవలం పూజలు మాత్రమే సరిపోవు, మన ప్రవర్తన కూడా ముఖ్యం. కష్టపడి పనిచేసే వారు, ఇతరుల హక్కులను కాలరాయకుండా ఉండేవారికి శని ఎప్పుడూ రక్షణగా ఉంటాడు. తల్లిదండ్రులను గౌరవించి, వృద్ధులకు సేవ చేసే వారిపై శని ప్రభావం సానుకూలంగా ఉంటుంది. మద్యపానం, మాంసాహారం వంటి అలవాట్లకు దూరంగా ఉంటూ, సాత్విక జీవనం గడిపేవారికి శని దోషాలు దరిచేరవు.
హనుమత్ భక్తి - శని దోషానికి విరుగుడు..పురాణ గాథల ప్రకారం, రావణుడి బంధీగా ఉన్న శనిదేవుడిని హనుమంతుడు రక్షించాడు. ఆ సమయంలో హనుమ భక్తులను తాను ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని శని దేవుడు మాట ఇచ్చాడు.శనివారాల్లో సుందరకాండ పఠించడం లేదా హనుమాన్ చాలీసా జపించడం వల్ల శని దోష తీవ్రత తగ్గుతుంది.
పరిహారాలు - పుణ్య కర్మలు..శని దేవుని ఆశీస్సులు లభించాలంటే ఏమేం పరిహారాలు ఆచరించాలి.. అంటే..?
రావి చెట్టు పూజ..శనివారం సాయంత్రం రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించాలి. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారని నమ్మకం, కాబట్టి అక్కడ దీపారాధన చేస్తే శని పీడ వదులుతుంది. మూగ జీవులను, ముఖ్యంగా కుక్కలు,కాకులను హింసించకూడదు. వాటికి ఆహారం పెట్టడం వల్ల శని దేవుడు ప్రసన్నుడవుతాడు.
శని దేవుని ఆగ్రహానికి గురయ్యే వారు ఎవరు..?కొన్ని పనులు చేయడం వల్ల శని దేవుని కఠిన శిక్ష తప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. పేదలను, స్త్రీలను, నిస్సహాయులను వేధించే వారిని శనిదేవుడు ఎన్నటికీ క్షమించడు.కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పడం లేదా ఇతరుల వెనుక గోతులు తవ్వడం వంటి పనులు శని ఆగ్రహానికి కారణమవుతాయి. తనను కన్న తల్లిదండ్రులను, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను అవమానించే వారికి శని దశ కష్టతరంగా మారుతుంది.శని భయం కంటే భక్తి ముఖ్యం. మనం చేసే ప్రతి పనిని గమనించే శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే 'సేవ, సత్యం, కరుణ' అనే మార్గాల్లో నడవడమే ఉత్తమ మార్గం. మంచి మనసుతో చేసే పనులే మనకు రక్షణ కవచాలుగా మారుతాయి.
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View PostMay 13, 2026
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమి...
View PostMay 13, 2026
కొల్చారం మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భ...
View PostMay 13, 2026
టాలీవుడ్ నటుడు Rajasekhar తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్రమైన Tirumalaను సందర్శించారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన రాజశేఖర్ ఫ్యామి...
View PostMay 12, 2026
మంచు గిరుల చెంత కొలువైన బద్రీనాథ్ ధామానికి వెళ్లే భక్తులకు ఇకపై ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికానుభూతి కలగనుంది. అలకనంద నది పరవళ్లకు తో...
View PostMay 12, 2026
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం Srisailam Temple వద్ద ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య ఘనం...
View Post