కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View Post
హిందూ సంప్రదాయంలో సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజును భోళాశంకరుడికి అత్యంత ప్రీతికరమైనదిగా భక్తులు భావిస్తారు. లయకారుడైన పరమశివుడిని సోమవారం నాడు భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే.. మనసులోని కోరికలు నెరవేరడమే కాకుండా జీవితంలోని సకల కష్టాలు, దరిద్రాలు తొలగిపోతాయని విశ్వాసం. అయితే, మహదేవుని అనుగ్రహం కోసం చేసే పూజల్లో 'శివతాండవ స్తోత్రం' పఠనానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది.
రావణ బ్రహ్మ స్వయంగా రచించిన ఈ స్తోత్రంతో సోమవారం నాడు స్వామివారిని అర్చిస్తే లభించే ఫలితాలు, పూజా విధానం గురించి తెలుసుకుందాం.
సోమవారం నాడు శివతాండవ స్తోత్రాన్ని పఠించే సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
శుచిత్వం ముఖ్యం.. సోమవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఇంట్లోని పూజా మందిరంలో గానీ, శివాలయంలో గానీ ఉన్న శివలింగానికి గంగాజలం, స్వచ్ఛమైన పచ్చిపాలతో భక్తితో అభిషేకం చేయాలి.స్వామివారికి విభూతి లేదా చందనంతో తిలకం దిద్దాలి. శివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వపత్రాలు, తెల్లటి పూలను సమర్పించాలి.
స్తోత్ర పఠనం..శివలింగం ముందు ప్రశాంతమైన మనస్సుతో ఆసీనులై, ధ్యానముద్రలో శివతాండవ స్తోత్రాన్ని స్పష్టమైన ఉచ్చారణతో పఠించాలి. స్తోత్ర పఠనం పూర్తయిన తర్వాత ఆవునెయ్యితో వెలిగించిన దీపంతో స్వామివారికి కర్పూర నీరాజనం ఇవ్వాలి. పూజా సమయంలో తెలిసీ తెలియక చేసిన తప్పులను క్షమించమని వేడుకుంటూ నమస్కరించాలి.
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View PostMay 13, 2026
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమి...
View PostMay 13, 2026
కొల్చారం మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భ...
View PostMay 13, 2026
టాలీవుడ్ నటుడు Rajasekhar తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్రమైన Tirumalaను సందర్శించారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన రాజశేఖర్ ఫ్యామి...
View PostMay 12, 2026
మంచు గిరుల చెంత కొలువైన బద్రీనాథ్ ధామానికి వెళ్లే భక్తులకు ఇకపై ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికానుభూతి కలగనుంది. అలకనంద నది పరవళ్లకు తో...
View PostMay 12, 2026
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం Srisailam Temple వద్ద ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య ఘనం...
View Post