కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View Post
రామాయణం అంటేనే చెడుపై మంచి సాధించిన విజయం.. అధర్మంపై ధర్మం పొందిన గెలుపు. లోకకంటకుడైన రావణుడిని సంహరించేందుకు సాక్షాత్తూ ఆ మహావిష్ణువే రాముడిగా అవతరించాడు. అయితే, పండితుడు, శివభక్తుడైన రావణుడు అసలు రాక్షసుడిగా ఎందుకు పుట్టాల్సి వచ్చింది..? దీని వెనుక వైకుంఠంతో ముడిపడి ఉన్న రహస్యం ఏంటి..?
వైకుంఠ ద్వారపాలకులు.. శాపగ్రస్తులు..శ్రీమహావిష్ణువు నివసించే వైకుంఠానికి జయ, విజయులు అనే ఇద్దరు ద్వారపాలకులు ఉండేవారు. వారు నిరంతరం స్వామి సేవలో తరిస్తూ, ఆయనకు అత్యంత ప్రియమైన భక్తులుగా ఉండేవారు. ఒకానొక సమయంలో బ్రహ్మ మానస పుత్రులైన సనకసనందనాదులు విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి వస్తే.. పసిబాలుర రూపంలో ఉన్న వారిని చూసి, జయ,విజయులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనిని అవమానంగా భావించిన ఋషులు.. సత్యలోక నివాసులైన మాకే అడ్డు చెబుతారా..? మీరు భూలోకంలో రాక్షసులుగా జన్మించండి' అని శపించారు.
మూడు జన్మలతో ముక్తి మార్గం..శాపం విన్న ద్వారపాలకులు తమ తప్పు తెలుసుకుని క్షమించమని వేడుకోగా, శాపాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని ఋషులు సెలవిచ్చారు. అయితే, సాక్షాత్తు ఆ శ్రీహరి చేతిలోనే మరణం పొందితే, త్వరగా శాపవిముక్తి కలిగి తిరిగి వైకుంఠానికి చేరుకుంటారని మార్గం చూపారు. అలా జయ, విజయులు మూడు యుగాలలో మూడు జంటలుగా జన్మించారు.
కృతయుగంలో..హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. వీరిని వరాహ, నరసింహస్వామి అవతారాల్లో సంహరించారు.
త్రేతాయుగంలో..రావణుడు, కుంభకర్ణుడు. శ్రీరామచంద్రుని చేతిలో వీరికి మోక్షం లభించింది.
ద్వాపరయుగంలో..శిశుపాలుడు, దంతవక్రుడు. శ్రీకృష్ణుని సుదర్శన చక్రానికి బలయ్యి మళ్లీ వైకుంఠానికి చేరుకున్నారు.
విముక్తి మాత్రమే..!రావణుడు చేసిన ప్రతి చర్య వెనుక తన ప్రభువు దగ్గరకు చేరుకోవాలనే తపన ఉంది. శ్రీరాముని చేతిలో మరణిస్తేనే తనకు శాపవిముక్తి కలుగుతుందని ఆ పండితుడికి తెలుసు. అందుకే పైకి రాక్షసత్వాన్ని ప్రదర్శించినా, అంతర్గతంగా ఆయన రామబాణం తగలడం ద్వారానే ప్రాణాలను వదలాలని వేచి చూశాడు.
పురాణాల ప్రకారం..ఈ విశేషమైన కథాంశం మనకు శ్రీమద్ భాగవత పురాణంలోని ఏడవ స్కంధంలో సవివరంగా కనిపిస్తుంది. అలాగే వరాహ పురాణం, తులసీదాసు రచించిన రామచరితమానస్ లోని బాలకాండలో కూడా ఈ 'జయ విజయ' శాప వృత్తాంతం ప్రస్తావించబడింది. భగవంతుడు తన భక్తులను ఉద్ధరించడానికి, వారికి మోక్షాన్ని ప్రసాదించడానికి రకరకాల లీలను ప్రదర్శిస్తాడని పురాణాలు నిరూపిస్తున్నాయి.
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View PostMay 13, 2026
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమి...
View PostMay 13, 2026
కొల్చారం మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భ...
View PostMay 13, 2026
టాలీవుడ్ నటుడు Rajasekhar తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్రమైన Tirumalaను సందర్శించారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన రాజశేఖర్ ఫ్యామి...
View PostMay 12, 2026
మంచు గిరుల చెంత కొలువైన బద్రీనాథ్ ధామానికి వెళ్లే భక్తులకు ఇకపై ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికానుభూతి కలగనుంది. అలకనంద నది పరవళ్లకు తో...
View PostMay 12, 2026
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం Srisailam Temple వద్ద ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య ఘనం...
View Post