కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View Post
కలలు కేవలం మన ఊహలు మాత్రమే కాదు, అవి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను కూడా సూచిస్తాయి. కలలు వచ్చినప్పుడు, వాటిని మన కుటుంబ సభ్యులతో గానీ స్నేహితులతో గానీ పంచుకోవడం చాలా మందికి అలవాటు.. అయితే, డ్రీమ్ ఆస్ట్రాలజీ ప్రకారం.. కొన్ని కలలను ఎవరితోనైనా పంచుకుంటే అవి నిజంగానే జరుగుతాయట. ఒకవేళ ఎవరితోనైనా చెబితే అవి జరుగకపోవచ్చట. కాబట్టి వాటిని వీలైనంత రహస్యంగా ఉంచడమే ఉత్తమమని పండితులు చెబుతున్నారు. అలాంటి కొన్ని ప్రత్యేకమైన కలల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇలాంటివి ఎవరికీ చెప్పకండి.మీకు దేవుళ్ళు, దేవతలు, పుణ్యక్షేత్రాలు లేదా మతపరమైన ఆచారాల గురించి వచ్చిన కలలు అయితే, వాటిని ఎవరితోనూ పంచు కోకూడదట. ఇలాంటి కలలు భవిష్యత్తులో శుభవార్తలను సూచిస్తాయని డ్రీమ్ ఆస్ట్రాలజీ ఎక్స్ పర్ట్స్ వెల్లడిస్తున్నారు. ఇలాంటి కలలు ఆధ్యాత్మిక పురోగతిని కూడా సూచిస్తాయి. కాబట్టి ఇలాంటి కలలను ఇతరులతో పంచుకుంటే మీ ప్రయోజనాలకు ఆటంకం కలిగించవచ్చు.
మరణానికి సంబంధించిన కలలు..తన మరణం గురించి గానీ, లేదా ఇతరుల మరణం గురించి గానీ కల వస్తే, అది భయానకంగా ఉంటుంది. అయితే, డ్రీమ్ ఆస్ట్రాలజీ ప్రకారం.. అటువంటి కల మన సమస్యల ముగింపును, ఒక కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. అయినప్పటికీ, ఈ కలను ఇతరులతో పంచుకోవడం దాని ప్రభావాన్ని తిప్పికొట్టవచ్చు. అందువల్ల, ఈ కలను ఎవరితోనూ పంచుకోక పోవడం బెటర్.
ఇలాంటి కలలను గురించి చెప్పవద్దు..ఒక వ్యక్తి తన కలలో డబ్బు, బంగారం లేదా వెండితో నిండిన కుండను చూస్తే, ఈ కల సమీప భవిష్యత్తులో ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తుంది. ఒకవేళ ఇలాంటి కల వస్తే ఇతరులతో పంచుకోవడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని, ఈ కల ప్రయోజనాలను మీరు పూర్తి స్థాయిలో పొందకపోవచ్చు.
డ్రీమ్ ఆస్ట్రాలజీ ప్రకారం.. , నదులు, పర్వతాలు లేదా పచ్చని తోటలు వంటి ప్రకృతి సౌందర్యాన్ని కలలలో కనిపించడం కూడా జీవితంలో సానుకూల మార్పులను సూచిస్తుంది. ఇలాంటి కలను ఎవరికీ చెప్పకపోవడం ఉత్తమం అని పండితులు వెల్లడిస్తున్నారు.
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View PostMay 13, 2026
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమి...
View PostMay 13, 2026
కొల్చారం మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భ...
View PostMay 13, 2026
టాలీవుడ్ నటుడు Rajasekhar తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్రమైన Tirumalaను సందర్శించారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన రాజశేఖర్ ఫ్యామి...
View PostMay 12, 2026
మంచు గిరుల చెంత కొలువైన బద్రీనాథ్ ధామానికి వెళ్లే భక్తులకు ఇకపై ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికానుభూతి కలగనుంది. అలకనంద నది పరవళ్లకు తో...
View PostMay 12, 2026
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం Srisailam Temple వద్ద ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య ఘనం...
View Post