కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View Post
దైవ దర్శనం కోసం వెళ్ళినప్పుడు గుడి బయట వదిలిన పాదరక్షలు కనిపించకపోతే ఎవరికైనా బాధ కలగడం సహజం. కొందరు దీనిని అపశకునంగా భావిస్తారు. కానీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆలయం వద్ద చెప్పులు పోవడం వెనుక ఒక సానుకూల సందేశం దాగి ఉందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శనివారం నాడు ఇలా జరిగితే మీ కష్టాలు తీరబోతున్నాయని ప్రకృతి పంపిస్తున్న సంకేతం అంటున్నారు. దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో తెలుసుకుందాం..
పాదరక్షలు - శని భగవానుడి ప్రభావం..మనిషి శరీరంలోని పాదాలకు, అలాగే మనం ధరించే బూట్లు, చెప్పులకు శని దేవుడు కారకుడిగా ఉంటాడు. జాతకంలో శని ప్రభావం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి అనేక ఆర్థిక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
దోష నివారణ.. ఆలయం వంటి పవిత్ర స్థలంలో పాదరక్షలు అపహరణకు గురవ్వడం అంటే, ఆ వ్యక్తిని అంటిపెట్టుకున్న శని దోషం లేదా ప్రతికూల శక్తి విడిచి వెళ్ళిందని అర్థం. ముఖ్యంగా శనివారం నాడు ఇలా జరిగితే, త్వరలోనే మీ జీవితంలో ఉన్న దుఃఖాలు తొలగిపోయి, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని సంకేతం.
సాధారణంగా శని దోషం ఉన్నవారు లేదా ఏలిననాటి శని ప్రభావంతో ఇబ్బంది పడేవారు శనివారాల్లో పాదరక్షలను దానం చేయాలని శాస్త్రం చెబుతోంది.కొందరు తెలియకనో లేదా ఇతర కారణాల వల్లనో దానం చేయలేకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఆలయం బయట చెప్పులు పోవడాన్ని 'అప్రయత్న దానం'గా పరిగణించవచ్చు. మీ కష్టాలను ఆ చెప్పుల రూపంలో ఎవరో తీసుకెళ్లారని భావించి ప్రశాంతంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
వ్యక్తిత్వంపై పాదరక్షల ప్రభావం..మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించడంలో పాదరక్షలు కీలక పాత్ర పోషిస్తాయి. జ్యోతిష్య రీత్యా కూడా చెప్పుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. బూట్లు ఎల్లప్పుడూ శుభ్రంగా, పాలిష్ చేసి ఉండాలి. మురికిగా ఉన్న పాదరక్షలు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఎట్టిపరిష్టితుల్లోనూ చిరిగిన లేదా పాడైపోయిన చెప్పులను ధరించడం మంచిది కాదు. ఇది చేసే పనుల్లో ఆటంకాలను సృష్టిస్తుంది. చాలామంది గుడిలో ఉన్నంత సేపు దేవుడి కంటే బయట ఉన్న తమ చెప్పులు లేదా బూట్లపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. కానీ, ప్రకృతి సిద్ధంగా జరిగే ఇటువంటి సంఘటనలు మీ మంచికే అని గ్రహించాలి. పాదరక్షల పోకడను ఒక నష్టంగా కాకుండా, శని దేవుడి అనుగ్రహంగా భావించినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది.
భక్తి మార్గంలో వెళ్లేటప్పుడు ఇష్టమైన వస్తువులపై మోహం వదులుకోవాలనేది ఒక కోణమైతే, జ్యోతిష్య రీత్యా అది దోష నివారణకు మార్గమని మరో కోణం. కాబట్టి, ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు మీ చెప్పులు పోతే ఆందోళన చెందకండి.. మీ కష్టాలు తీరబోతున్నాయని నవ్వుతూ ముందుకు సాగాలని పండితులు చెబుతున్నారు.
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View PostMay 13, 2026
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమి...
View PostMay 13, 2026
కొల్చారం మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భ...
View PostMay 13, 2026
టాలీవుడ్ నటుడు Rajasekhar తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్రమైన Tirumalaను సందర్శించారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన రాజశేఖర్ ఫ్యామి...
View PostMay 12, 2026
మంచు గిరుల చెంత కొలువైన బద్రీనాథ్ ధామానికి వెళ్లే భక్తులకు ఇకపై ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికానుభూతి కలగనుంది. అలకనంద నది పరవళ్లకు తో...
View PostMay 12, 2026
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం Srisailam Temple వద్ద ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య ఘనం...
View Post