కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View Post
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడిని ‘మనోకారకుడు’ మనస్సుకు అధిపతి అని పిలుస్తారు. మన ఆలోచనలు, భావోద్వేగాలు, మానసిక స్థితిగతులు అన్నీ చంద్రుడి ప్రభావంతోనే ముడిపడి ఉంటాయి. ఎవరైతే తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన లేదా అశాంతితో బాధపడుతుంటారో.. వారు సోమవారం నాడు పరమశివునితో పాటు చంద్రుడిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
శివారాధనతో గ్రహ దోష నివారణ..సోమవారం అంటేనే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు అత్యంత ప్రీతికరమైన రోజు. శివుడు తన జటాజూటంలో చంద్రుడిని ధరించడం వల్ల, శివారాధన చేసే భక్తులపై చంద్రుని అనుగ్రహం త్వరగా కలుగుతుంది. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నా లేదా చంద్ర దోషాలు ఉన్నా సోమవారం ఉపవాసం ఉండి శివాభిషేకం చేయడం వల్ల ఆ దోషాలు తొలగిపోతాయి. దీనివల్ల చేపట్టిన పనుల్లో విజయం సిద్ధించడమే కాకుండా, మానసిక స్థైర్యం పెరుగుతుంది.
దానధర్మాలు చేయడం వల్ల..చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోమవారం నాడు తెల్లని వస్తువులను దానం చేయడం విశేష ఫలితాలనిస్తుంది. పాలు, పెరుగు, బియ్యం లేదా తెల్లని వస్త్రాలను పేదలకు దానం చేయడం వల్ల జాతకంలో చంద్రుని బలం పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు.
పఠించాల్సిన శక్తివంతమైన మంత్రాలు..పూజా సమయంలో ఈ మంత్రాలను జపించడం వల్ల మనసు నిర్మలంగా ఉంటుంది.
చంద్ర గాయత్రీ మంత్రం.. 'ఓం అమృతాంగయే విద్మహే కాలరూపాయ ధీమహి, తన్నో సోమః ప్రచోదయాత్.'
చంద్ర ధ్యాన శ్లోకం..'దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవసంభవమ్ | నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణమ్ ||'
శివ మంత్రం.. 'ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ | ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||'
సరళ మంత్రం.. 'ఓం ఐం క్లీం సోమాయ నమః' లేదా 'ఓం నమః శివాయ'. నిత్యం ఒత్తిడితో సతమతమయ్యేవారు ఈ సోమవారం నియమాలను పాటించి, భక్తితో ఈ మంత్రాలను జపిస్తే కొన్ని రోజుల్లోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View PostMay 13, 2026
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమి...
View PostMay 13, 2026
కొల్చారం మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భ...
View PostMay 13, 2026
టాలీవుడ్ నటుడు Rajasekhar తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్రమైన Tirumalaను సందర్శించారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన రాజశేఖర్ ఫ్యామి...
View PostMay 12, 2026
మంచు గిరుల చెంత కొలువైన బద్రీనాథ్ ధామానికి వెళ్లే భక్తులకు ఇకపై ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికానుభూతి కలగనుంది. అలకనంద నది పరవళ్లకు తో...
View PostMay 12, 2026
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం Srisailam Temple వద్ద ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య ఘనం...
View Post