కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View Post
ఆధ్యాత్మిక వెలుగులతో ప్రపంచాన్ని జాగృతం చేసిన క్రియా యోగ గురువులు, మరణాన్ని సైతం జయించిన మహాత్ములని భక్తులు విశ్వసిస్తారు. 'ఒక యోగి ఆత్మకథ' గ్రంథం ద్వారా విశ్వవ్యాప్త ఖ్యాతి గడించిన శ్రీ శ్రీ పరమహంస యోగానంద, మార్చి 7 (1952)న మహాసమాధి చెందగా.. ఆయన గురువు, 'కైవల్య దర్శనం' కర్త శ్రీ శ్రీ స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి సరిగ్గా 90 ఏళ్ల క్రితం అంటే 1936 మార్చి 9వ తేదీన మహాసమాధి స్థితిని అలంకరించారు. ఈ సందర్భంగా క్రియా యోగ విశిష్టతపై ప్రత్యేక కథనం..
మరణాన్ని జయించిన మహాత్ములు..యోగ సంప్రదాయంలో మరణం అనేది కేవలం దేహ త్యాగం మాత్రమే. సంపూర్ణ స్పృహతో శరీరాన్ని వదిలిపెట్టడమే మహాసమాధి. యోగానంద తన శిష్యులకు అభయమిస్తూ.. 'నేను మీతోనే నడుస్తాను, నా అదృశ్య హస్తాలతో మిమ్మల్ని నిరంతరం రక్షిస్తాను' అని 97 ఏళ్ల క్రితమే ప్రకటించారు. ఆయన గురువు శ్రీయుక్తేశ్వర్ గిరి కూడా తన శిష్యుల హృదయాలలో శాశ్వతంగా నివసిస్తానని వాగ్దానం చేశారు.
గురు శిష్యుల అనుబంధం..వారణాసి వీధుల్లో 17 ఏళ్ల ప్రాయంలో శ్రీయుక్తేశ్వర్ను కలిసిన యోగానంద.. తన గురువు కఠిన క్రమశిక్షణలో పదేళ్ల పాటు శిక్షణ పొందారు. మహావతార్ బాబాజీ అప్పగించిన దైవిక బాధ్యతను నెరవేరుస్తూ, శ్రీయుక్తేశ్వర్ తన శిష్యుడిని ప్రపంచ ప్రఖ్యాత యోగిగా తీర్చిదిద్దారు. యోగానంద ద్వారానే క్రియా యోగ సందేశం ఖండాంతరాలకు వ్యాపించింది.
విజ్ఞాన శాస్త్రానికి అందని అద్భుతం..క్రియా యోగ సాధన కేవలం ఆధ్యాత్మిక ప్రక్రియ మాత్రమే కాదు, అదొక ప్రాచీన విజ్ఞాన శాస్త్రం. నిరంతర శ్వాస ప్రక్రియ ద్వారా రక్తాన్ని డీకార్బొనేట్ చేయడం వల్ల శరీరం క్షీణించకుండా ఉంటుందని 'ఒక యోగి ఆత్మకథ' వివరిస్తోంది.
పరమహంస యోగానంద మహాసమాధి చెందిన 20 రోజుల తర్వాత కూడా ఆయన భౌతిక కాయం ఏమాత్రం చెడిపోకుండా ఉండటం యోగ శక్తికి నిదర్శనంగా నిలిచింది.
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఈ పురాతన విద్యను పతంజలి మహర్షి తదితరులు అభ్యసించారు. ఆధునిక యుగంలో మహావతార్ బాబాజీ ద్వారా లాహిరి మహాశయులకు, అక్కడి నుంచి శ్రీయుక్తేశ్వర్ గిరి మీదుగా యోగానందకు ఈ విద్య లభించింది.
గురువు ప్రేరణతో యోగానంద 1917లో రాంచీలో 'యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (YSS)', 1920లో లాస్ ఏంజిల్స్లో 'సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ (SRF)' సంస్థలను స్థాపించారు. నేటికీ ఈ సంస్థల ద్వారా లక్షలాది మంది క్రియా యోగ మార్గంలో పయనిస్తూ ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతున్నారు.
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View PostMay 13, 2026
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమి...
View PostMay 13, 2026
కొల్చారం మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భ...
View PostMay 13, 2026
టాలీవుడ్ నటుడు Rajasekhar తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్రమైన Tirumalaను సందర్శించారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన రాజశేఖర్ ఫ్యామి...
View PostMay 12, 2026
మంచు గిరుల చెంత కొలువైన బద్రీనాథ్ ధామానికి వెళ్లే భక్తులకు ఇకపై ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికానుభూతి కలగనుంది. అలకనంద నది పరవళ్లకు తో...
View PostMay 12, 2026
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం Srisailam Temple వద్ద ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య ఘనం...
View Post