కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View Post
విశ్వ కల్యాణ కారకుడు, పరమ విష్ణు భక్తుడు అయిన దేవఋషి నారద ముని జన్మించిన పవిత్ర దినమే నారద జయంతి. నిరంతరం 'నారాయణ.. నారాయణ..' అనే నామస్మరణతో ముల్లోకాలను చుట్టివచ్చే నారదుడు, భగవంతుడికి భక్తుడికి మధ్య వారధిగా నిలుస్తారు. ఈ ఏడాది మే 2వ తేదీన నారద జయంతిని జరుపుకోబోతున్నాం. ఈ పవిత్ర పర్వదినాన శ్రీమన్నారాయణుడిని పూజిస్తే కష్టాలు తొలగి, సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ముహూర్త విశేషాలు..జ్యేష్ఠ మాస కృష్ణ పక్ష ప్రతిపద తిథి మే 1వ తేదీ రాత్రి 10:52 గంటలకు ప్రారంభమై, మే 3వ తేదీ తెల్లవారుజామున 12:49 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రాశస్త్యం మేరకు మే 2, 2026 (శనివారం) నాడు నారద జయంతిని నిర్వహించుకోవాలి.
శుభ సమయాలు..బ్రహ్మ ముహూర్తం: ఉదయం 4:14 - 4:57
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:52 - మధ్యాహ్నం 12:45
గోధూళి ముహూర్తం: సాయంత్రం 6:56 - 7:17
నారద జయంతి నాడు భక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా మందిరాన్ని అలంకరించుకోవాలి. నారద ముని ఇష్టదైవం శ్రీమహావిష్ణువు. అందుకే ఈ రోజున ముందుగా విష్ణుమూర్తిని షోడశోపచారాలతో పూజించాలి. విష్ణువును ధ్యానించిన తర్వాత దేవఋషి నారదుడిని స్మరిస్తూ పూజ చేయాలి.
నైవేద్యం..స్వామివారికి చందనం, కుంకుమ, సుగంధ పుష్పాలను సమర్పించాలి. నెయ్యితో చేసిన హల్వా, పంచామృతం, తాజా పండ్లను నివేదించాలి. విష్ణుమూర్తికి సమర్పించే ఏ నైవేద్యంలోనైనా తులసి దళం తప్పనిసరి. తులసి లేని నైవేద్యాన్ని హరి స్వీకరించడని భక్తుల నమ్మకం. పూజానంతరం భక్తిశ్రద్ధలతో హారతి ఇచ్చి, నారాయణ నామస్మరణ చేయాలి.
నారద జయంతి రోజున...ఏ ఏ మంత్రాలను జపించడం వల్ల మానసిక ప్రశాంతత, కార్యసిద్ధి కలుగుతాయి అంటే..?
ఓం విష్ణవే నమః
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
శాంతాకారం భుజంగశయనం పద్మనాభం సురేశం,
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం,
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ||..
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View PostMay 13, 2026
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమి...
View PostMay 13, 2026
కొల్చారం మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భ...
View PostMay 13, 2026
టాలీవుడ్ నటుడు Rajasekhar తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్రమైన Tirumalaను సందర్శించారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన రాజశేఖర్ ఫ్యామి...
View PostMay 12, 2026
మంచు గిరుల చెంత కొలువైన బద్రీనాథ్ ధామానికి వెళ్లే భక్తులకు ఇకపై ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికానుభూతి కలగనుంది. అలకనంద నది పరవళ్లకు తో...
View PostMay 12, 2026
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం Srisailam Temple వద్ద ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య ఘనం...
View Post