కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View Post
సాధారణంగా ఏదైనా శుభకార్యం జరిగినా, కొత్త పని ప్రారంభించినా మనం కొబ్బరికాయ కొడతాం. భక్తితో దేవుడిని ప్రార్థిస్తాం. కానీ ఒక చోట మాత్రం కొబ్బరికాయ కొడితే చాలు.. అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాల నిజం. ఇండోనేషియాలోని ఓ తెగ వారు శతాబ్దాలుగా ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆధ్యాత్మికతకు, అపనమ్మకానికి మధ్య వారధిగా నిలిచే ఆ ఆచారం విశేషాలేంటో చూద్దాం..
లేవాక్ టపో'.. రహస్య ఆచారం..ఇండోనేషియాలోని తూర్పు నుసా తెంగారా ప్రాంతంలో నివసించే 'లమహోలోట్' తెగ ప్రజల ఆచారం ఇది. వీరు తూర్పు ఫ్లోరెస్, లెంబటా జిల్లాల్లోని ద్వీపాల్లో నివసిస్తుంటారు. వీరు తమ పూర్వీకుల ఆత్మలతో సంభాషించడానికి, దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి 'లేవాక్ టపో' అనే సంప్రదాయాన్ని నిర్వహిస్తారు.
టపో అంటే ఏమిటి..?లమహోలోట్ భాషలో 'టపో' అంటే కొబ్బరికాయ అని అర్థం. ఈ ఆచారంలో కొబ్బరికాయే ప్రధాన పాత్ర పోషిస్తుంది. సహజ మరణాల కంటే.. ప్రమాదాలు, హత్యలు లేదా చిన్న వయసులో సంభవించే అసహజ మరణాల వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడమే ఈ ఆచారం ముఖ్య ఉద్దేశం.
పూర్వీకులు చేసిన పాపాలు శాపాలుగా మారి తర్వాతి తరాలకు తగులుతాయని వీరి నమ్మకం. ఎవరైనా అకాల మరణం చెందితే, ఆ పాపమేంటో తెలుసుకుని భవిష్యత్తు తరాలను కాపాడుకోవడానికి ఈ పూజ చేస్తారు.
ఈ తెగలో ఆధ్యాత్మిక నాయకుడిని 'షామన్' అని పిలుస్తారు. అసహజ మరణం సంభవించినప్పుడు, షామన్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయను పగలగొడతాడు. కొబ్బరికాయ పగిలిన తీరును బట్టి మరణానికి గల అసలు కారణాన్ని షామన్ వివరిస్తాడు. ఆ మరణానికి కారణం పూర్వీకుల శాపమని లేదా దేవుడి ఆగ్రహమని తెలిసిన వెంటనే, అక్కడున్న వారంతా గట్టిగా ఏడవడం ప్రారంభిస్తారు. ఆ ఏడుపు ద్వారా తమ తప్పులను క్షమించమని, మృతుని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటారు.
ప్రపంచీకరణ పుణ్యమా అని ఎన్నో తెగలు కనుమరుగవుతున్నా, లమహోలోట్ ప్రజలు మాత్రం తమ ప్రాచీన నమ్మకాలను నేటికీ వదలకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. బయటి ప్రపంచానికి ఇది వింతగా అనిపించినా, వారికి మాత్రం ఇది వారి సంస్కృతిలో ఒక భాగం.
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View PostMay 13, 2026
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమి...
View PostMay 13, 2026
కొల్చారం మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భ...
View PostMay 13, 2026
టాలీవుడ్ నటుడు Rajasekhar తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్రమైన Tirumalaను సందర్శించారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన రాజశేఖర్ ఫ్యామి...
View PostMay 12, 2026
మంచు గిరుల చెంత కొలువైన బద్రీనాథ్ ధామానికి వెళ్లే భక్తులకు ఇకపై ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికానుభూతి కలగనుంది. అలకనంద నది పరవళ్లకు తో...
View PostMay 12, 2026
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం Srisailam Temple వద్ద ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య ఘనం...
View Post