కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View Post
ప్రకృతి ఒడిలో కొలువై.. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే ఉత్తరాఖండ్లోని పవిత్ర చార్ ధామ్ యాత్రకు వేళయింది. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 19న యమునోత్రి, గంగోత్రి ధామాల తలుపులు తెరుచుకోవడంతో ఈ ఏడాది ఆధ్యాత్మిక పయనం అట్టహాసంగా ప్రారంభమైంది. హిమగిరుల సాక్షిగా సాగే ఈ యాత్రలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా రద్దీ నియంత్రణ, భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి యాత్రికుడు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి.
చతుర్థామ దర్శనం..చార్ ధామ్ యాత్రలో భాగంగా భక్తులు నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు..
యమునోత్రి..యమునా నది జన్మస్థానం.
గంగోత్రి..భాగీరథీ నది పుణ్యధామం.
కేదార్నాథ్..పంచకేదారాల్లో ప్రధానమైన శివక్షేత్రం.
బద్రీనాథ్.. వైకుంఠ సమానమైన మహావిష్ణువు నివాసం.
నమోదు ఎందుకు..?
లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం, అత్యవసర సమయాల్లో వేగంగా సహాయం అందించడం మరియు యాత్రా మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడటం ఈ రిజిస్ట్రేషన్ ప్రధాన ఉద్దేశం.
ఆన్లైన్ ద్వారా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి..?ఇంటి నుంచే సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అధికారిక వెబ్సైట్ registrationandtouristcare.uk.gov.in ను సందర్శించాలి.
'Register/Login' విభాగంలో పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ వివరాలతో ఖాతాను సృష్టించుకోవాలి.
మొబైల్కు వచ్చే OTP ద్వారా ధృవీకరణ పూర్తి చేయాలి.
లాగిన్ అయిన తర్వాత, యాత్రలో పాల్గొనే వారి వివరాలు, వయస్సు, ప్రయాణ తేదీలు, సందర్శించాలనుకుంటున్న క్షేత్రాలను ఎంచుకోవాలి.
గుర్తింపు కార్డు (ఆధార్/ఓటర్ ఐడీ/పాన్ కార్డ్) స్కాన్ కాపీని అప్లోడ్ చేయాలి.
ప్రక్రియ పూర్తయ్యాక మొబైల్కు URN (Unique Registration Number) వస్తుంది. దీని ఆధారంగా రిజిస్ట్రేషన్ ఫారమ్ను డౌన్లోడ్ చేసుకుని, యాత్ర ముగిసే వరకు భద్రపరుచుకోవాలి.
సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. హరిద్వార్, రిషికేశ్, సోన్ప్రయాగ్, బర్కోట్ వంటి ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. అక్కడ బయోమెట్రిక్ లేదా ఫోటోమెట్రిక్ పద్ధతిలో మీ వివరాలను నమోదు చేయించుకుని యాత్రా అనుమతి పత్రాన్ని పొందవచ్చు. అయితే, రద్దీ దృష్ట్యా కొంచెం ముందుగానే కౌంటర్లకు చేరుకోవడం ఉత్తమం. హిమాలయాల్లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి, యాత్రికులు తగినన్ని ఊలు దుస్తులు, అత్యవసర మందులను వెంట ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View PostMay 13, 2026
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమి...
View PostMay 13, 2026
కొల్చారం మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భ...
View PostMay 13, 2026
టాలీవుడ్ నటుడు Rajasekhar తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్రమైన Tirumalaను సందర్శించారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన రాజశేఖర్ ఫ్యామి...
View PostMay 12, 2026
మంచు గిరుల చెంత కొలువైన బద్రీనాథ్ ధామానికి వెళ్లే భక్తులకు ఇకపై ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికానుభూతి కలగనుంది. అలకనంద నది పరవళ్లకు తో...
View PostMay 12, 2026
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం Srisailam Temple వద్ద ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య ఘనం...
View Post