కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View Post
మానవ మాత్రుడై ఉండి కూడా వెయ్యి బాహువుల శక్తిని పొంది, సాక్షాత్తు లంకాధిపతి రావణుడినే బంధించిన వీరుడు కార్తవీర్యార్జునుడు. యయాతి వంశోద్భవుడైన కృతవీర్యుని కుమారుడు అర్జునుడు. అత్యంత పరాక్రమవంతుడైన ఈయన 'కార్తవీర్యార్జునుడు'గా, 'సహస్రార్జునుడు'గా చరిత్రలో నిలిచిపోయారు. కేవలం భుజబలమే కాకుండా, దైవబలం తోడైతేనే ధర్మాన్ని రక్షించగలమని నమ్మిన ఈ చక్రవర్తి జీవితం నేటికీ ఒక పాఠం.
కోరుకున్న నాలుగు వరాలు..?రాజ్యం సిద్ధించినా మనశ్శాంతి కలగని అర్జునుడు, అత్రి మహర్షి పుత్రుడైన దత్తాత్రేయ స్వామిని శరణు వేడాడు. అరణ్యంలో కఠోర తపస్సు ఆచరించి స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు. భక్తుడి దీక్షకు మెచ్చిన దత్తాత్రేయుడు ప్రత్యక్షమవ్వగా, అర్జునుడు లోక కల్యాణం కోసం నాలుగు విశిష్ట వరాలను కోరుకున్నాడు:
సహస్ర బాహువులు.. అవసరమైనప్పుడు యుద్ధ రంగంలో వెయ్యి చేతులు ధరించే శక్తి.అధర్మ శిక్షణ.. లోకంలో అధర్మాన్ని అణచివేసే సామర్థ్యం. ధర్మ పరిపాలన..సకల భూమండలాన్ని జయించి, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించే శక్తి.వీర మరణం..తనకంటే బలవంతుడైన యోధుడి చేతిలో మాత్రమే తనకు అంత్యం కలగాలి. దత్తాత్రేయుడి వరప్రసాదంతో కార్తవీర్యార్జునుడు అజేయుడిగా మారాడు. ఒకసారి నర్మదా నదిలో జలక్రీడలు ఆడుతూ, తన వెయ్యి చేతులతో నది ప్రవాహాన్నే అడ్డుకున్నాడు. ఆ సమయంలో అక్కడే శివపూజ చేస్తున్న రావణుడు ఆగ్రహించి యుద్ధానికి దిగాడు. అయితే, కార్తవీర్యార్జునుడు అనతికాలంలోనే రావణుడిని బంధించి తన రాజధాని మహిష్మతికి తీసుకువెళ్లాడు. చివరకు పులస్త్య బ్రహ్మ కోరిక మేరకు రావణుడిని విడిచిపెట్టి తన ఉదారతను చాటుకున్నాడు.
ముని శాపంతో.అర్జునుడి పాలనలో రాజ్యం సుభిక్షంగా సాగింది. వేల సంఖ్యలో యజ్ఞాలు చేసి దేవతలను మెప్పించాడు. అయితే, విధివశాత్తూ వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతంలోని అడవిని దహనం చేయడంతో ఆయన శాపానికి గురయ్యాడు. 'ఒక బ్రాహ్మణుడి చేతిలో నీ బాహువులు ఖండించబడతాయి' అన్న వశిష్ఠుడి శాపమే అర్జునుడి నాలుగో వరానికి మార్గమైంది.
చివరకు భృగు వంశీయుడైన పరశురాముడితో తలపడ్డ అర్జునుడు, ఆయన గొడ్డలి దెబ్బకు తన వెయ్యి చేతులను కోల్పోయి వీరమరణం పొందాడు. తనకంటే శక్తిమంతుడైన విష్ణు అంశ సంభూతుడి చేతిలోనే మరణించాలన్న తన ఆఖరి కోరిక నెరవేరడంతో, కార్తవీర్యార్జునుడు ధన్యజీవిగా నిలిచాడు.
మనమేం గ్రహించాలి అంటే..? : అధికారం అహంకారాన్ని పెంచకూడదు, ధర్మాన్ని రక్షించే ఆయుధంగా మారాలి. కార్తవీర్యార్జునుడి జీవితం మనకు నేర్పే పరమార్థం ఇదే..!
May 14, 2026
కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార...
View PostMay 13, 2026
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమి...
View PostMay 13, 2026
కొల్చారం మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భ...
View PostMay 13, 2026
టాలీవుడ్ నటుడు Rajasekhar తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్రమైన Tirumalaను సందర్శించారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన రాజశేఖర్ ఫ్యామి...
View PostMay 12, 2026
మంచు గిరుల చెంత కొలువైన బద్రీనాథ్ ధామానికి వెళ్లే భక్తులకు ఇకపై ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికానుభూతి కలగనుంది. అలకనంద నది పరవళ్లకు తో...
View PostMay 12, 2026
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం Srisailam Temple వద్ద ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య ఘనం...
View Post