నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View Post
సనాతన ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలతో పాటు, దృష్టి దోషం (దిష్టి) నుంచి విముక్తి పొందేందుకు కూడా జ్యోతిష్యం పలు సులభమైన మార్గాలను, పరిహారాలను సూచించింది. ఒక వ్యక్తిపై చెడు దృష్టి పడినప్పుడు వారిలోని సానుకూల శక్తి క్షీణించి, జీవితంలో అనేక అవాంతరాలు ఎదురవుతాయని పండితులు చెబుతుంటారు. ఎదిగే వారికి దిష్టి తగిలితే పురోగతి కుంటుపడుతుందని నమ్ముతారు. ఒకవేళ మీరు కూడా ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, దిష్టి నివారణకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పరిహారాలు, వాటి సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దృష్టి దోషం ఉన్నట్లు గుర్తించడం ఎలా..?జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి లేదా కుటుంబం దృష్టి దోషానికి గురైనప్పుడు పలుసంకేతాలు కనిపిస్తాయి. అవేంటంటే..?
కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి కారణం లేకుండానే నిరంతరం గొడవలు, మనస్పర్థలు రావడం.
ఇంట్లో ప్రశాంతత, సంతోషం కరువై అశాంతి నెలకొనడం.
అనుకోకుండా శారీరక నలత, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం.
వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టాలు రావడం లేదా ఆశించిన స్థాయిలో విజయం లభించకపోవడం.
ప్రతి పనిలోనూ ప్రతికూలత, ఆటంకాలు ఎదురై పురోగతి నిలిచిపోవడం.
ఒక రాగి పాత్ర నిండా శుభ్రమైన నీటిని తీసుకోవాలి. దిష్టి తగిలిన వ్యక్తి ముందు నిలబడి, ఆ పాత్రను వారి తల చుట్టూ 11 సార్లు (దిష్టి తీస్తున్నట్లుగా) తిప్పాలి. ఆ తర్వాత ఆ నీటిని ఎవరి పాదాలూ పడని ఏదైనా మొక్క మొదట్లో గానీ లేదా నిర్జన ప్రదేశంలోని కూడలిలో గానీ పోయాలి. ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరూ మిమ్మల్ని పిలవడం లేదా అంతరాయం కలిగించడం వంటివి చేయకూడదని గుర్తుంచుకోవాలి.
2. భైరవ స్వామి నల్ల దారం..నిరంతరం దిష్టి దోషంతో ఇబ్బంది పడేవారు కాలభైరవుడి (భైరో బాబా) ఆలయానికి వెళ్లి, అక్కడ పూజించిన నల్ల దారాన్ని తెచ్చుకుని చేతికి కట్టుకోవాలి. రక్షణ కవచంలా పనిచేసే ఈ నల్ల దారం ప్రతికూల శక్తులను దరిచేరనివ్వకుండా అడ్డుకుంటుందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు.
3. లవంగాల విశిష్ట పరిహారం..దృష్టి దోష నివారణకు లవంగాలతో చేసే పరిహారం అత్యంత ప్రభావవంతమైనదిగా భావిస్తారు. కుటుంబంలో ఎవరికైనా దిష్టి తగిలిందనిపిస్తే.. ఐదు లవంగాలను చేతిలోకి తీసుకుని, సదరు వ్యక్తి తల చుట్టూ కుడి వైపు నుంచి ఏడు సార్లు (క్లాక్వైజ్), ఎడమ వైపు నుంచి ఏడు సార్లు (యాంటీ-క్లాక్వైజ్) తిప్పాలి. అనంతరం వాటిని కాల్చివేయడం లేదా దూరంగా పారేయడం ద్వారా దృష్టి దోషం తొలగిపోతుందని నమ్ముతారు.
జ్యోతిష్య శాస్త్ర నియమాల ప్రకారం భక్తిశ్రద్ధలతో ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి, తిరిగి ఆనందం, ఐశ్వర్యం, మనశ్శాంతి సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View PostJune 6, 2026
Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...
View PostJune 4, 2026
తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...
View PostJune 4, 2026
కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...
View PostJune 3, 2026
పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...
View PostJune 3, 2026
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...
View Post